Madurai: విమానాశ్రయంలో విషాదం
ABN , First Publish Date - 2022-08-27T15:26:43+05:30 IST
మదురై విమానాశ్రయం(Madurai Airport)లో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మరణించిన సంఘటన విషాదానికి దారితీసింది. మదురై అన్నానగర్ సమీపంలోని
- గుండెపోటుతో ప్రయాణికుడు మృతి
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 26: మదురై విమానాశ్రయం(Madurai Airport)లో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మరణించిన సంఘటన విషాదానికి దారితీసింది. మదురై అన్నానగర్ సమీపంలోని తహసీల్దార్ నగర్కు చెందిన కుమరేశన్ పాండ్యన్ (72) తన కుమార్తెతో ముంబై(Mumbai) వెళ్లేందుకు శుక్రవారం మదురై ఉదయం విమానాశ్రయానికి వెళ్లారు. వారు విమానాశ్రయంలోని వెయిటింగ్ హాల్లో వేచివున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుమరేశన్ పాండ్యన్కు విమానాశ్రయంలోనే ప్రథమ చికిత్సలందించి అంబులెన్స్ ద్వారా మదురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే దారి మధ్యలోనే కుమరేశన్ పాండ్యన్ మరణించారు.