Shocking: భార్య రెండోసారి శృంగారానికి ఒప్పుకోలేదని దారుణం.. పశువులా మారిన భర్త ఎంత పని చేశాడంటే..
ABN , First Publish Date - 2022-12-09T18:38:45+05:30 IST
ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. రెండోసారి శృంగారానికి భార్య అంగీకరించలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య శవాన్ని 50 కిలోమీటర్ల అవతల అడవిలో పారేశాడు. తర్వాత..
ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. రెండోసారి శృంగారానికి భార్య అంగీకరించలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య శవాన్ని 50 కిలోమీటర్ల అవతల అడవిలో పారేశాడు. తర్వాత తన భార్య కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం అంగీకరించాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.
అమ్రోహీ జిల్లాకు చెందిన మహ్మద్ అన్వర్ అనే వ్యక్తి బేకరీ షాపు నిర్వహిస్తున్నాడు. తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న అన్వర్కు భార్య రుక్షర్ (30), ముగ్గురు పిల్లలు ఉన్నారు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రెండోసారి శృంగారం వద్దు అని రుక్షర్ చెప్పినందుకు అన్వర్కు కోపం వచ్చింది. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య శవాన్ని 50 కిలోమీటర్ల అవతల అడవిలో పారేశాడు. తర్వాత తన భార్య కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం పోలీసులకు రుక్షర్ మృతదేహం దొరికింది. పోస్ట్మార్టమ్లో ఆమెను ఎవరో గొంతు నులిమి చంపినట్టు తేలింది.
హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అన్వర్ను విచారించారు. ముందు ఏవో కట్టు కథలు చెప్పిన అన్వర్ ఆ తర్వాత అసలు నిజం అంగీకరించాడు. తన భార్య రెండోసారి శృంగారానికి అంగీకరించకపోవడంతో క్షణికావేశంలో చంపేశానని చెప్పాడు. దీంతో పోలీసులు అన్వర్ను అదుపులోకి తీసుకున్నారు.