వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడి దుర్మరణం
ABN , First Publish Date - 2022-12-02T12:18:00+05:30 IST
శివమొగ్గ జిల్లా భధ్రావతి తాలూకా దొణబఘట్ట గ్రామంలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు సయ్యద్ మదని(Sayed Madani) దుర్మరణం చెందారు
బెంగళూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): శివమొగ్గ జిల్లా భధ్రావతి తాలూకా దొణబఘట్ట గ్రామంలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు సయ్యద్ మదని(Sayed Madani) దుర్మరణం చెందారు. సయ్యద్ తండ్రి బుధవారం సాయంత్రం పొలంపై వెళ్ళగా అతడిని వెంబడిస్తూ బాలుడు అదేమార్గంగా వెళ్ళారు. సుమారు ఏడెనిమిది వీధికుక్కలు బాలుడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. విచక్షణా రహితంగా కొరకడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స ఆందించాక శివమొగ్గలోని మెడికల్ కళాశాలకు అనుబంధమైన మెగ్గాన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక గురువారం ఉదయం బాలుడు మృతి చెందారు. కుక్కలు దాడి చేసే సమయంలో సయ్యద్ తండ్రి వరిభత్యం మిషన్ నిర్వహిస్తున్నారు. మిషన్ శబ్దానికి కుక్కల దాడిని గమనించలేకపోయారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఆక్రందనలు మిన్నంటాయి.