Viral News: నెల రోజులుగా కూతురు కనిపించడంలేదని తల్లి ఫిర్యాదు.. వెలుగులోకి వచ్చిన దారుణం.. కూర మాడిపోయిందని భర్త..

ABN , First Publish Date - 2022-10-23T11:29:50+05:30 IST

పెళ్లై భర్తతో కాపురం చేసుకుంటున్న కూతురుకి అప్పుడప్పుడూ ఫోన్ చేసి.. ఆ తల్లి యోగక్షేమాలు తెలుసుకునేది. కానీ ఎంత ప్రయత్నించినా నెల రోజులుగా కూతురుతో ఆమె మాట్లాడలేకపోయింది. దీంతో అల్లుడికి ఫోన్ చేసింది. అతడు ఏవేవో కారణాలు చెబుతుండ

Viral News: నెల రోజులుగా కూతురు కనిపించడంలేదని తల్లి ఫిర్యాదు.. వెలుగులోకి వచ్చిన దారుణం.. కూర మాడిపోయిందని భర్త..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లై భర్తతో కాపురం చేసుకుంటున్న కూతురుకి అప్పుడప్పుడూ ఫోన్ చేసి.. ఆ తల్లి యోగక్షేమాలు తెలుసుకునేది. కానీ ఎంత ప్రయత్నించినా నెల రోజులుగా కూతురుతో ఆమె మాట్లాడలేకపోయింది. దీంతో అల్లుడికి ఫోన్ చేసింది. అతడు ఏవేవో కారణాలు చెబుతుండటంతో.. ఆమెకు అనుమానం కలిగింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అధికారులు రంగంలోకి దిగడంతో దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఒడిశా‌లోని సంబల్పూర్ జిల్లాకు చెందిన రంజన్‌కు ప్రస్తుతం 36ఏళ్లు. కొన్నేళ్ల క్రితం అతడికి సావిత్రి అనే మహిళతో వివాహం జరిగింది. భార్యభర్తలు రౌత్పరా గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే సావిత్ర తల్లి అప్పుడప్పుడూ తన కూతురుకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకునేది. కానీ గత నెల రోజులుగా ఎంత ప్రయత్నించినా ఆమె తన కూతురుతో మాట్లాడలేకపోయింది. దీంతో అల్లుడికి ఫోన్ చేసింది. ఈ క్రమంలో రంజన్.. రకరకాల కారణాలు చెబుతుండటంతో ఆమె అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో అధికారులు రంగంలోకి దిగారు. రంజన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అతడు చేసిన తప్పు బయటపెట్టాడు. నెల రోజుల క్రితం తాబేలును ఇంటికి తీసుకొచ్చి.. కూర వండమని తన భార్యకు చెప్పినన్నాడు. అయితే.. ఆ కూరను సావిత్ర మాడగొట్టిందని వెల్లడించాడు. దీంతో తాగిన మైకంలో ఆమెను ఇష్టమొచ్చినట్టు కొట్టినట్టు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సావత్రి మరణించిందని తెలిపాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పూడ్చి పెట్టినట్టు వివరించాడు. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.

Updated Date - 2022-10-23T11:29:50+05:30 IST
Read more