Mumbai: భారత్కు వచ్చిన అమెరికా మహిళకు షాకింగ్ అనుభవం..
ABN , First Publish Date - 2022-11-28T19:40:49+05:30 IST
వ్యాపారకారణాల రీత్యా భారత్కు వచ్చిన ఓ అమెరికా మహిళకు ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది.
న్యూఢిల్లీ: వ్యాపారకారణాల రీత్యా భారత్కు వచ్చిన ఓ అమెరికా మహిళకు(US businesswoman) ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. తను ఎక్కిన క్యాబ్ డ్రైవర్(Cab Driver) తన ముందే అత్యంత నీచంగా ప్రవర్తించాడంటూ ఆమె ముంబై(Mumbai) పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు డీఎన్ నగర్ పోలీసులు..డ్రైవర్ యోగేంద్ర ఉపాధ్యాయ్ను అదుపులోకి తీసుకున్నారు. బాంద్రాలోని ఓ కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగా.. అతడిపై 354ఏ, 509 సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలు వ్యాపారావసరాల రీత్యా నెల రోజులుగా ఇండియాలో ఉంటున్నారు. శనివారం ఆమె తన పని పూర్తి చేసుకున్నాక సహోద్యోగులతో కలిసి ఓ ఎస్యూవీ క్యాబ్లో ముంబైకి బయలుదేరారు. వారందరూ ఒకరి తరువాత మరొకరు దిగిపోయాక.. కారులో ఆమె ఒక్కరే మిగిలిపోయారు. దీంతో.. డ్రైవర్ అకస్మాత్తుగా నీచానికి పాల్పడ్డాడు. దీంతో.. అతడు చేస్తున్నది చూసి హడలిపోయిన ఆమె ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయడంతో వారు డ్రైవర్ను కారు బయటకు లాగి దేహశుద్ధి చేశారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. కాగా.. గతంలో నిందితుడపై కేసులేవీ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.