తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-12-10T07:53:38+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) స్వామివారి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) స్వామివారి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 57,581 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.12 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 27021 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2022-12-10T07:53:40+05:30 IST