మళ్లీ నెల రోజుల ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్లు : ట్రాయ్‌

ABN , First Publish Date - 2022-01-28T05:36:02+05:30 IST

టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ పెద్ద ఝలక్‌ ఇచ్చింది. ఈ కంపెనీలు తమ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు..

మళ్లీ నెల రోజుల ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్లు : ట్రాయ్‌

న్యూఢిల్లీ: టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ పెద్ద ఝలక్‌ ఇచ్చింది. ఈ కంపెనీలు తమ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు 30 రోజులు చెల్లుబాటయ్యే రీచార్జ్‌ ప్లాన్లు అందించాలని స్పష్టం చేసింది. గతంలో కంపెనీలు 30 రోజులు చెల్లుబాటయ్యే రీచార్జ్‌ ప్లాన్లు అమలు చేసేవి. అయి తే రెండేళ్ల నుంచి దీన్ని 28 రోజులకు కుదించాయి. దాంతో ప్రీపెయిడ్‌ ఖాతాదారులు సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్‌ చేయించుకోవాల్సి వస్తోంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ట్రాయ్‌ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ఉత్తర్వులు జారీ అయిన 60 రోజుల్లోగా టెలికాం కంపెనీలు ఈ నిర్ణయం అమలు చేయాలని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ఇక నుంచి కంపెనీలు విధిగా 30 రోజులు చెల్లుబాటయ్యేలా కనీసం ఒక ప్లాను వోచర్‌, ఒక స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌, ఒక కాంబో వోచర్‌ ఆఫర్‌ చేయాలని కోరింది.

Updated Date - 2022-01-28T05:36:02+05:30 IST