ఇక సీసీఐ పరిధిలోకి జీఎ్సటీ లాభాల కేసులు
ABN , First Publish Date - 2022-11-25T03:46:28+05:30 IST
కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది...
న్యూఢిల్లీ: కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. జీఎ్సటీ తగ్గింపు ప్రయోజనాల్ని కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయక పోతే సీసీఐ ఇక వారి భరతం పట్టనుంది. ప్రస్తుతం నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అఽథారిటీ (ఎన్ఏపీఏ) ఈ కేసులు చూస్తోంది. డిసెంబరు 1 నుంచి ఈ అధికారం సీసీఐకి బదిలీ కానుంది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.