LIC Scheme : ఈ LIC స్కీం గురించి తెలుసా.. నెలకు రూ.18,500 ఖాతాలో వచ్చి పడతాయ్..!

ABN , First Publish Date - 2022-09-17T22:27:09+05:30 IST

సీనియర్ సిటిజన్స్‌కు అండగా నిలిచేందుకు ‘ప్రధాన మంత్రి వయో వందన యోజన’ (Pradhan Mantri Vaya Vandana Yojana) పథకాన్ని..

LIC Scheme : ఈ LIC స్కీం గురించి తెలుసా.. నెలకు రూ.18,500 ఖాతాలో వచ్చి పడతాయ్..!

సీనియర్ సిటిజన్స్‌కు అండగా నిలిచేందుకు ‘ప్రధాన మంత్రి వయో వందన యోజన’ (Pradhan Mantri Vaya Vandana Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చింది. అయితే చాలామందికి ఈ పథకం గురించి అవగాహన లేకపోవడంతో సీనియర్ సిటిజన్స్‌లో (Senior Citizens) ఎక్కువ మంది ఈ ఫలాలు పొందలేకపోతున్నారు. ‘ప్రధాన మంత్రి వయో వందన యోజన’ అనేది ఒక సామాజిక భద్రత కల్పించే పథకం. ఈ స్కీం కింద లబ్దిదారులు నెలనెలా పెన్షన్ (Monthly Pension) పొందొచ్చు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నిర్వహిస్తోంది. ఈ స్కీంలో చేరేందుకు భార్యాభర్తలిద్దరికీ 60 సంవత్సరాల వయసు దాటితే సరిపోతుంది. గరిష్టంగా రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. గతంలో 7.5 లక్షల వరకూ మాత్రమే ఉన్న పెట్టుబడి పరిమితిని తర్వాత రూ.15 లక్షలకు పెంచారు. అంటే రెట్టింపు చేశారు. సీనియర్ సిటిజన్స్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కీమ్స్‌తో పోల్చుకుంటే ఈ స్కీం ఉత్తమమైందని చెప్పొచ్చు. 60 ఏళ్లు పైబడిన వారు ఈ ‘ప్రధాన మంత్రి వయో వందన యోజన’ పథకానికి అర్హులు.



భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీంలో చేరి రూ.15 లక్షలు కడితే.. అంటే ఇద్దరి మీద రూ.30 లక్షల పెట్టుబడి పెడితే ఆ పెట్టిన మొత్తంపై 7.40 శాతం సాంవత్సరిక వడ్డీ పొందొచ్చు. అంతేకాదు.. సంవత్సరానికి 2,22000 వడ్డీని లబ్దిదారులు పొందగలరు. ఈ మొత్తాన్ని నెలకు ఎంతని చూసుకుంటే.. నెలకు 18,500 రూపాయలను నెలనెలా పెన్షన్ రూపంలో పొందే అవకాశం లబ్దిదారులకు ఉంది. అదే.. భార్యాభర్తల్లో ఒక్కరే ఈ స్కీంలో చేరితే రూ.15 లక్షలు కడితే సాంవత్సరిక వడ్డీ 1,11000 రూపాయలు అవుతుంది. ఈ వడ్డీని లబ్దిదారుడు నెలకు రూ.9,250 పెన్షన్ రూపంలో పొందొచ్చు. ఈ స్కీం కాల పరిమితి 10 సంవత్సరాలు. అయితే.. ఈ స్కీంలో చేరేందుకు సీనియర్ సిటిజన్స్‌కు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. మార్చి 31, 2023 వరకూ మాత్రమే ఈ స్కీంలో చేరేందుకు అర్హులైన సీనియర్ సిటిజన్స్‌కు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.



ఈ స్కీంలో చేరి డబ్బు కట్టిన సీనియర్ సిటిజన్స్ నెలనెలా పెన్షన్ పొందొచ్చు. అక్కర్లేదనుకుంటే.. త్రైమాసికం, ఆరు నెలలు, వార్షికంగా కూడా పెన్షన్ పొందొచ్చు. ఈ స్కీంలో చేరేందుకు వయసు ఇంతకు మించి ఉండకూడదనే నిబంధన ఏమీ లేదు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఎవరైనా చేరవచ్చు. ఈ పదేళ్ల లోపు లబ్దిదారుడు దురదృష్టవశాత్తూ చనిపోతే ఆ స్కీంలో పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. లబ్దిదారుడు ఈ స్కీం గడువు ఉన్నంత వరకూ.. అంటే పదేళ్ల పాటు ఉంటే.. అతనికి స్కీంలో పెట్టిన పెట్టుబడితో పాటు పెన్షన్ మొత్తాన్ని కూడా కలిపి చెల్లిస్తారు. ‘ప్రధాన మంత్రి వయో వందన యోజన’ స్కీంలో గరిష్టంగా రూ.15 లక్షల కట్టవచ్చు. కనిష్టంగా.. రూ.1,62,162, రూ.1,61,074, రూ.1,59,574, రూ.1,56,658 ప్లాన్లు లబ్దిదారులకు అందుబాటులో ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ 15 లక్షలకు మించి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టలేరు. 2017 జులైలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ‘ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (PMVVY) పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది.

Updated Date - 2022-09-17T22:27:09+05:30 IST