అక్టోబరు 4న బజాజ్ ఎలకా్ట్రనిక్స్ ఐపీఓ
ABN , First Publish Date - 2022-09-26T08:35:50+05:30 IST
బజాజ్ ఎలకా్ట్రనిక్స్ పేరుతో ఎలక్ట్రిక్, ఎలకా్ట్రనిక్ వినియోగ ఉపకరణాలు విక్రయిస్తున్న ఎలకా్ట్రనిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ (ఈఎంఐఎల్) రూ.500 కోట్ల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది.
రూ.500 కోట్ల సమీకరణ లక్ష్యం
న్యూఢిల్లీ: బజాజ్ ఎలకా్ట్రనిక్స్ పేరుతో ఎలక్ట్రిక్, ఎలకా్ట్రనిక్ వినియోగ ఉపకరణాలు విక్రయిస్తున్న ఎలకా్ట్రనిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ (ఈఎంఐఎల్) రూ.500 కోట్ల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. అక్టోబరు 5న ప్రారంభం కానున్న ఈ ఐపీఓ అదే నెల 7న ముగుస్తుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించనున్న నిధుల్లో రూ.111.14 కోట్లను వ్యాపార విస్తరణ కోసం వెచ్చించనుండగా రూ.220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ.55 కోట్లను రుణాల చెల్లింపు కోసం కంపెనీ వినియోగించనుంది. ఈఎంఐఎల్ దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో 112 రిటైల్ స్టోర్లు నిర్వహిస్తోంది. ఇందులో ఎక్కువ స్టోర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. కాగా అక్టోబరు 17న ఈఎంఐఎల్ షేర్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టవుతాయి.