AG&P Pratham: డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-01T01:05:04+05:30 IST
సహజ వాయువును ప్రజలకు దగ్గర చేస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు ప్రయత్నిస్తున్న
తిరుపతి: సహజ వాయువును ప్రజలకు దగ్గర చేస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు ప్రయత్నిస్తున్న ఏజీ అండ్ పీ ప్రథమ్ (AG&P Pratham) మరో అడుగు ముందుకేసింది. డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల కోసం తాజాగా గూడూరులో రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. నాయుడుపేటలో ఇప్పటికే దాదాపు 4500 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్టు నెల్లూరు, చిత్తూరు జిల్లాల రీజినల్ హెడ్ చిరాగ్ కె భన్వాడియా తెలిపారు. ఈ సందర్భంగా గూడూరులోని కరణాల వీధిలో ఓ ఇంటిలో మీటర్, పైప్లైన్ను ఏర్పాటును ప్రారంభించారు.
సహజవాయువు సురక్షితమైన ఇంధనమని, ఎల్పీజీతో పోలిస్తే 20 శాతం గ్యాస్ను ఆదా చేస్తుందని పేర్కొన్నారు. ఏపీలోని విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర నగరాల్లో ఇంధనంగా ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ వచ్చినట్టు తెలిపారు. సహజ వాయువు సరఫరా-డిమాండ్ అంతరాన్ని తగ్గించేందుకు నెల్లూరు జిల్లాలో మార్చి 2023 నాటికి కంపెనీ సుమారు 20 వేల పీఎన్జీ కనెక్షన్లను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు.