4 రోజుల నష్టాలకు తెర
ABN , First Publish Date - 2022-12-09T01:18:38+05:30 IST
బ్యాంకింగ్, ఆటో విభాగాలకు చెందిన షేర్లు లాభపడడంతో గురువారం ఈక్విటీ మార్కెట్ నాలుగు రోజుల నష్టాలకు తెర దించింది...
ముంబై: బ్యాంకింగ్, ఆటో విభాగాలకు చెందిన షేర్లు లాభపడడంతో గురువారం ఈక్విటీ మార్కెట్ నాలుగు రోజుల నష్టాలకు తెర దించింది. అయితే విదేశీ నిధుల తరలింపు, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలు మార్కెట్ జోరును నిలువరించాయి. మొత్తం మీద సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 62,570.68 వద్ద ముగియగా నిఫ్టీ 48.85 పాయింట్ల లాభంతో 18,609.35 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ షేర్లలో 13 లాభపడగా 17 నష్టపోయాయి.