Guntur: కిడ్నాప్ చేసి అత్యాచారం.. యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-10-08T12:54:09+05:30 IST
నల్లపాడు పోలీస్స్టేషన్ పరిధిలోని వెంగళాయపాలెంలో శుక్రవారం రాత్రి ఓ యువతి(19) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు
గుంటూరు: నల్లపాడు పోలీస్స్టేషన్ పరిధిలోని వెంగళాయపాలెంలో శుక్రవారం రాత్రి ఓ యువతి(19) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో నల్లపాడు సీఐ బత్తుల శ్రీనివాసరావు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో మృతురాలు రాసిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆమె గత ఆగస్టు 20న ఇంటి నుంచి అదృశ్యమైంది. అయితే తనను ఆరుగురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో పోలీసులు శ్రీనివాసరావు అనే యువకుడిని అరెస్టు చేశారు. అయితే తనను శ్రీనివాసరావు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, సూసైడ్ లెటరులో రాసినట్టు తెలిసింది. అందువల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టుగా లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.