వైసీపీ మానవత్వం లేని పార్టీ: అశోక్ గజపతిరాజు
ABN , First Publish Date - 2022-01-23T19:06:57+05:30 IST
వైసీపీ మానవత్వం లేని పార్టీ: అశోక్ గజపతిరాజు
విజయనగరం: వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శలు గుప్పించారు. వైసీపీ మానవత్వం లేని పార్టీ అని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడేవారిని బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడమే వైసీపీకి తెలుసు అని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అశోక్ గజపతి స్పష్టం చేశారు.