జగన్ అండతోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాల దాడులు: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2022-10-05T21:25:36+05:30 IST
జగన్ అండతోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాల దాడులు: అచ్చెన్నాయుడు
అమరావతి: వైసీపీ నేతలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ఏపీలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ అండతోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాల దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలు బోయబొంతిరాళ్లలో మాదన్న హత్యను ఖండిస్తున్నామని అన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తమ కార్యకర్తల కుటుంబాల కన్నీళ్లకు కారణమైన వారిని వదలమని అచ్చెన్నాయుడు అన్నారు.