ఆన్లైన్ మోసాలపై అప్రమత్తం చేయండి
ABN , First Publish Date - 2022-07-05T08:08:31+05:30 IST
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తం చేయండి
సైబర్ క్రైంకు మహిళా కమిషన్ లేఖ
ఆన్లైన్ మోసాలు, రుణ యాప్ల దురాగ తాలపై మహిళలు, బాలికలను అప్రమత ్తం చేయాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైం పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. ఆన్లైన్ మోసం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయపేట మండలం చిల్లకల్లులో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్వేతాచౌదరి ఉదంతంపై సోమవారం కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరా తీశారు. సమగ్ర దర్యాప్తుతో నివేదిక పంపాలని పోలీసులను ఆదేశించారు.