నేడు పీఆర్సీ సాధన సమితి సమావేశం
ABN , First Publish Date - 2022-01-23T05:49:10+05:30 IST
పీఆర్సీ జీవోలు వెనక్కి తీసు కోవాలని, హెచ్ఆర్ఏ స్లాబ్లు, పెన్షనర్లకు అదనపు పెన్షన్, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు, కంటింజెంట్, ఔట్ సోర్సింగ్, దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని చేసిన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఏలూరు పవరుపేటలోని ఏపీ ఎన్జీవో హోంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఏపీ జేఏసీ–అమరావతి జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్, ఏపీ జేఏసీ జిల్లా కన్వీనర్ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు
ఏలూరు ఎడ్యుకేషన్, జనవరి 22 : పీఆర్సీ జీవోలు వెనక్కి తీసు కోవాలని, హెచ్ఆర్ఏ స్లాబ్లు, పెన్షనర్లకు అదనపు పెన్షన్, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు, కంటింజెంట్, ఔట్ సోర్సింగ్, దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని చేసిన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఏలూరు పవరుపేటలోని ఏపీ ఎన్జీవో హోంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఏపీ జేఏసీ–అమరావతి జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్, ఏపీ జేఏసీ జిల్లా కన్వీనర్ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. జేఏసీలో భాగస్వామ్యం ఉన్న అన్ని సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశానికి హాజరై తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.