29 స్కూళ్లలో సీబీఎస్‌ఈ బోధన !

ABN , First Publish Date - 2022-02-23T05:31:59+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ ఈ బోధనను ప్రవేశ పెట్టడానికి జిల్లాలోని 29 పాఠశాలలను ఎంపి కచేశారు.

29 స్కూళ్లలో సీబీఎస్‌ఈ బోధన !

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 22 : ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ ఈ బోధనను ప్రవేశ పెట్టడానికి జిల్లాలోని 29 పాఠశాలలను ఎంపి కచేశారు. వచ్చే ఏడాది (2022 –23) నుంచి ఈ పాఠశాలల్లో తొలు త 9, 10 తరగతులతో సీబీఎస్‌ఈ బోధనను ప్రారంభించి ఆపై ఏటా ఒక్కో తరగతి చొప్పున 12వ తరగతి వరకు విస్తరిస్తారు. ఈ పాఠశా లల జాబితా డీఈవో ఆమోదం పొందిన వెంటనే సీబీఎస్‌ఈ అఫిలి యేషన్‌ కోసం సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు కేంద్రానికి దరఖా స్తు చేయాలి. గోపన్నపాలెం, ఆచంట, పోలవరం, పెంటపాడు, జంగా రెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, గుండుగొలను, రాజంపాలెం, సత్రంపాడు, లక్కవరం, శనివారపుపేట, చిన్నాయిగూడెం, పిప్పర, కానూరు, దువ్వ, చినఅమిరం, కొప్పాక, ఐ.పంగిడి, కైకరం, పూళ్ల, దేవ రపల్లి, తూర్పుతాళ్ళు, చెరుకువాడ, వాడపల్లి, కాళ్ళ, తడికలపూడి, కూచింపూడి, పెనుమంట్రలలోని స్టేట్‌ గవర్నమెంట్‌/జిల్లా పరిషత్‌ పాఠశాలలను సీబీఎస్‌ఈ పాఠశాలలుగా మార్చి వేస్తారు.

Updated Date - 2022-02-23T05:31:59+05:30 IST