రిలయన్స్‌లో అదనంగా నూనె నిల్వలు

ABN , First Publish Date - 2022-03-16T05:33:59+05:30 IST

భీమవరం పట్టణంలోని పలు మాల్స్‌, దుకాణాలపై మంగళవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు.

రిలయన్స్‌లో అదనంగా నూనె నిల్వలు
రిలయన్స్‌ మార్ట్‌లో పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

కేసు నమోదు చేసిన విజిలెన్స్‌ అధికారులు


భీమవరం క్రైం, మార్చి 15 : భీమవరం పట్టణంలోని పలు మాల్స్‌, దుకాణాలపై మంగళవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. స్పెన్సర్స్‌, డీ మార్ట్‌, రిలయన్స్‌ స్మార్ట్‌, దుండి బజార్‌ పలు దుకాణాలుపై దాడులు చేసినట్టు విజిలెన్స్‌ సీఐ పి.శివరామకృష్ణ తెలిపారు. రిలయన్స్‌ స్మార్ట్‌లో అధికంగా 900 కేజీలు మంచినూనె నిల్వ ఉండడంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయించినా నిల్వలు ఉంచినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-03-16T05:33:59+05:30 IST