నేడు ‘శశి’లో నీట్ కౌన్సెలింగ్పై అవగాహన
ABN , First Publish Date - 2022-09-18T05:26:48+05:30 IST
వేలివెన్ను శశి ఇంజనీరింగ్ క్యాంపస్లో ఆదివారం నీట్ కౌన్సెలింగ్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తణుకు, సెప్టెంబరు 17: వేలివెన్ను శశి ఇంజనీరింగ్ క్యాంపస్లో ఆదివారం నీట్ కౌన్సెలింగ్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్సెస్ నిపుణులతో కౌన్సెలింగ్ విధివిధానాలు, ఆలిండియా కోటా, స్టేట్ కోటా, లోకల్, నాన్లోకల్, పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేయనున్నారని తెలిపారు.