ప్రాణం తీసిన రోడ్డు
ABN , First Publish Date - 2022-08-21T05:45:34+05:30 IST
రహదారి రక్తదా హానికి ఒక యువకుడు బలయ్యాడు. రోడ్డు పనుల కోసం వేసిన కంకరగుట్టను ఢీకొట్టిన ప్రమాదంలో అత్తిలి గ్రామానికి చెందిన ముచ్చి రమేష్ (22) మృతి చెందాడు.
కంకరగుట్టను ఢీకొని యువకుడి మృతి
పెంటపాడు, ఆగస్టు 20 : రహదారి రక్తదా హానికి ఒక యువకుడు బలయ్యాడు. రోడ్డు పనుల కోసం వేసిన కంకరగుట్టను ఢీకొట్టిన ప్రమాదంలో అత్తిలి గ్రామానికి చెందిన ముచ్చి రమేష్ (22) మృతి చెందాడు. ఇతను కారు డ్రైవింగ్ చేస్తూ జీవిస్తుంటాడు. శనివారం ఉదయం 5 గంటలకు పనినిమిత్తం అత్తిలి నుంచి తాడేపల్లిగూడెం మోటర్ సైకిల్పై వస్తు న్నాడు. పెంటపాడు మండలం ముదునూరు వద్ద రోడ్డు పనులు చేస్తుండటంతో రోడ్డుపై వేసిన కంకర గుట్టను ఢీకొట్టాడు. ఈ ఘట నలో తలకు తీవ్ర గాయం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. రమే ష్కు ఐదు నెలల క్రితమే వివాహం అయినట్లు స్థానికులు తెలిపారు.