వైభవంగా మహా కుంభాభిషేకం

ABN , First Publish Date - 2022-11-28T23:51:11+05:30 IST

పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు సోమవారం ముగిశాయి.

వైభవంగా మహా కుంభాభిషేకం
కలశాలతో ఆలయ ప్రదక్షిణ, ఆలయ శిఖరానికి మహా కుంబాభిషేకం

భీమవరం టౌన్‌, నవంబరు 28: పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు సోమవారం ముగిశాయి. అలయ అర్చకుడు వాడపల్లి ఆదినారాయణాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు విశ్వక్వేనపూజ, పుణ్యాహవచనం, అష్టబంధన, సప్త కలశారాధన, నవ కలశారాధన చేశారు. ఆలయ ప్రదక్షిణ అనం తరం కలశాల్లోని మంత్ర జలాలతో ఆలయ శిఖరానికి మహా కుంభాభిషేకం చేశారు. గోదర్శనం, దర్పదర్శనం చేయించారు. తదుపరి పూర్ణాహుతితో కార్యక్రమా న్ని పరిసమాప్తి చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఆర్‌ గంగా శ్రీదేవి, చైర్మన్‌ మంతెన రామ్‌కుమార్‌రాజు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.

క్షీరా రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 28: క్షీరా రామలింగేశ్వరస్వామికి సోమవారం ప్రత్యేక ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవార్లకు కుంకు మ పూజలు నిర్వహించారు. గోశాలలో గోపూ జలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం పంచ హారతులు ఇచ్చి ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఈవో యాళ్ళ సూర్యనారాయణ, పాలక మండలి చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు, ట్రస్టీలు, భక్తులు పాల్గొన్నారు. శంకర మఠం, శంభేశ్వర స్వామివారికి అభిషేకాలు, అమ్మవార్లకు పూజలు చేశారు.

Updated Date - 2022-11-28T23:51:13+05:30 IST