బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసులు విచారణ
ABN , First Publish Date - 2022-11-11T10:54:35+05:30 IST
తాడేపల్లిగూడెం మండలం కడీయద్ద వద్ద బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Tadepalligudem : తాడేపల్లిగూడెం మండలం కడీయద్ద వద్ద బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. బాణాసంచా తయారీకి అన్నవరం అనే వ్యక్తి లైసెన్స్ తీసుకున్నారు. 15 కిలోల వరకు మాత్రమే ముడిసరుకు నిల్వకు అనుమతి ఇచ్చారు. అనుమతికి మించి వందల కిలోల ముడి సరుకును నిల్వ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులున్నారు.