ముంపు గ్రామాలుగా ప్రకటించాలని రిలే దీక్షలు
ABN , First Publish Date - 2022-11-08T00:01:08+05:30 IST
నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు.
కుక్కునూరు, నవంబరు 7: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న నాలుగు గ్రామాలను 41.15 కాంటూర్ లెవల్ల్లో చేర్చి పునరావాస పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ప్రతీ ఏటా గోదావరి వరదలకు తమ గ్రామాలు ముంపునకు గురి అవుతున్నప్పటికీ వాటిని 41.15 కాంటూర్ లెవల్ల్లో చేర్చలేదంటూ కౌండిన్యముక్తి, బెస్తగూడెం, మాధవరం, ఎల్లప్పగూడెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరదతో ప్రతీ ఏటా నష్టపోతు న్నామని ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్దాయిలో పరిశీలించి మా గ్రామాలను ముంపులోకి చేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
Read more