AP News: అభివృద్ధి పనులు ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-08-29T23:29:08+05:30 IST
కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా : ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (Polavaram MLA Balaraju) కొయ్యలగూడెం మండలంలో పర్యటించారు. సీతంపేట గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ.35 లక్షల
కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా : ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (Polavaram MLA Balaraju) కొయ్యలగూడెం మండలంలో పర్యటించారు. సీతంపేట గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ రైతులతో కలిసి పొలం బడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అధిక దిగుబడులను వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థులకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, ఎంపీపీ గంజిమాల రామారావు, గొడ్డాటీ నాగేశ్వర రావు, తుమ్మలపల్లి గంగరాజు, స్థానిక సర్పంచ్ తోటకూర పద్మావతి, నరసన్నపాలెం సర్పంచ్ కరెడ్ల ప్రభావతి, స్థానిక ఎంపీటీసీ మిరియాల విజయ, బయ్యనగుడెం సొసైటీ అధ్యక్షులు తోట జయబాబు, గంజి మాల దేవి, దాసరి విష్ణు, మట్టా సత్తి పండు, షేక్ బాజీ, గంటా శ్రీనివాసరావు, సంకుకొండ, స్థానిక నాయకులు మధ్యాహ్నపు యేసు, కొప్పుల వెంకటేశ్వర్లు, తారిపిరెడ్డి సత్యనారాయణ, కేదాసు రామకృష్ణ, నేరుసు కుమార్ రాజు, తారిపీరెడ్డి అప్పారావు, కొప్పుల మధుబాబు, రామిన ప్రభాకర రావు, దూలపల్లి కాంతారావు, సర్పంచులు తుక్కయ్య, గేలం త్రివిక్రమ రాజు, గడ్డియ్య, అధికారులు, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు.