AP News: కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి: బొరగం శ్రీనివాసులు
ABN , First Publish Date - 2022-09-13T03:27:44+05:30 IST
జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా: టీడీపీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababau Naidu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) పై మాజీ మంత్రి కొడాలి నాని (Kodali nani) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నాయకులు పోలవరం (Polavaram) పోలీస్ స్టేషన్
జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా: టీడీపీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababau Naidu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) పై మాజీ మంత్రి కొడాలి నాని (Kodali nani) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నాయకులు పోలవరం (Polavaram) పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ..
‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును కొడాలి నాని దుర్భాషలాడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలస్లో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. నాని నోరు అదుపులో పెట్టుకోవాలి. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే..తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టే. ఇప్పటికైనా కొడాలి నాని బుద్ధి తెచ్చుకుని నోరు అదుపులో పెట్టుకోకపోతే పద్ధతిగా ఉండదు’ అని హెచ్చరించారు.
కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ, నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు కుంచె దొరబాబు, మండల ప్రధాన కార్యదర్శి నునకాని రాంబాబు, పట్టిసీమ సర్పంచ్ సబ్బవరపు శ్రీరామ్మూర్తి, నియోజకవర్గ రైతు కార్యదర్శి పాదం ప్రసాద్, యస్వీఆర్, మహిళా నాయకురాలు మడకం లక్ష్మి, మైనార్టీ సెల్ నాయకుడు బాషా, సీనియర్ నాయకుడు కొత్తపల్లి సత్యనారాయణ, క్లస్టర్ ఇంచార్జి ఆకుల రాజా, నాయకులు జల్లేపల్లి రాజా, నియోజకవర్గ ఎస్సీ నాయకులు యడ్ల వినోద్, మండల ఎస్సీ నాయకులు పిల్లి నాగరాజు, తాడేపల్లి మనోజ్,ఈశ్వర్, బన్ను, యేసు, ఐటీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి జల్లేపల్లి శేష వెంకట జితేంద్ర పాల్గొన్నారు.