Jangareddygudem: చంద్రబాబును గెలిపించండి.. టీడీపీ నాయకుల విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-09-09T02:16:23+05:30 IST

జిలుగుమిల్లి మండలం టీ గంగన్నగూడెం, దిబ్బగూడెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో....

Jangareddygudem: చంద్రబాబును గెలిపించండి.. టీడీపీ నాయకుల విజ్ఞప్తి

జంగారెడ్డిగూడెం (ఏలూరు జల్లా):  జిలుగుమిల్లి మండలం టీ గంగన్నగూడెం, దిబ్బగూడెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులుతో పాటు జిలుగుమిల్లి మండలం మండల పార్టీ అధ్యక్షుడు సుంకవల్లి సాయి, తెలుగురైతు ఏలూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఉండవల్లి సోమ సుందరం, తెలుగుయువత నియోజకవర్గం అధ్యక్షుడు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, ఎస్టీ సెల్ అధ్యక్షులు చాపా రవి, తెలుగుయువత మండల అధ్యక్షుడు ఆకిరెడ్డి ప్రసాద్, ఐటిడిపి కోఆర్డినేటర్ సంపత్,  కొమరం వీరప్ప, చాప ముత్తయ్య రావు, చాప శ్రీను,కొమరం వెంకేట్ రమణ,గీగా రమేష్, కొమరం వెంకేటేష్, చాప నాగరాజు, మడకం విరస్వామి, షేక్ కాశం, కారం రమేష్, పండు చిన్న, కొమరం పోతురాజు, చాప రాంబాబు, తొనం రామకృష్ణ, షేక్ ఖాదర్ ,షేక్ నాగులమీరా, కొరసం మధు, మడకం శ్రీను, మడివి వెంకేటేష్, షేక్ బాజి, పండు రాజలు, ఆకిరెడ్డి ప్రభాకర్, పిన్నమనేని శ్రీను, ఈడ్పుగంటి అచ్యుతరావు, బిక్కిన వెంకటరావు, ఏంట్రప్రగడ నారాయణరావు, కోణాల శ్రీను, మెత్తుకురి సత్తిబాబు, మరిదు పండు, పాపారావు, మరిదు సూర్యయ్య, పండు రాముడు తదితరులు పాల్గొన్నారు.


వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నిత్యావసరాలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, కరెంట్ ఆర్టీసి చార్జీలు పెంచటమే కాకుండా మద్యపాన నిషేధం అని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడేమో జే - బ్రాండ్స్ నాసిరకం మద్యం అమ్ముతూ సొమ్ములు చేసుకుంటున్నారని ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమ పథకాలు పేరుతో అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని.. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. 



Updated Date - 2022-09-09T02:16:23+05:30 IST