నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ABN , First Publish Date - 2022-03-16T06:29:02+05:30 IST
జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడి యట్ ప్రాక్టికల్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 15 :జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడి యట్ ప్రాక్టికల్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 7,174 మంది బోటనీ, 7,173 మంది జువాలజి, 24 వేల 438 మంది ఫిజిక్స్, కెమిస్ట్రీ విద్యార్థులు ప్రాక్టికల్స్కు రిజిస్టర్ చేసుకున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం 138 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరుగుతాయి. అన్ని కేంద్రాల్లో స్క్వాడ్ బృందాలను నియమించారు.