29,624 మందికి ఇన్‌పుట్‌ సబ్సిడీ: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-02-16T05:44:23+05:30 IST

అధిక వర్షాలతో జిల్లాలో నష్టపోయిన 29,624 మంది రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేసిందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు.

29,624 మందికి ఇన్‌పుట్‌ సబ్సిడీ: కలెక్టర్‌

ఏలూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): అధిక వర్షాలతో జిల్లాలో నష్టపోయిన 29,624 మంది రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేసిందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు. ఇన్‌పుట్‌ సబ్సిడీపై సీఎం కార్యాలయం నుంచి నిర్వహిం చిన వీసీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతేడాది నవంబరులో కురిసిన అధిక వర్షాలకు జిల్లాలో 14,061 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, ఇందులో 13,808 హెక్టార్లలో వరి నష్టపోయిన 29,298 మంది రైతులకు  రూ. 20.71 కోట్లు మంజూరైందన్నారు. అలాగే వేరుశనగ, మినుము, పత్తిరైతులకు సబ్సిడీ మంజూరైందని, జిల్లాలో వైఎస్సార్‌ సేవా పథకం ద్వారా 71 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లకు రూ. 3.45 కోట్ల సబ్సిడీని విడుదల చేసిందన్నారు. ఎమ్మెల్యే తలారి  మాట్లాడుతూ పంట నష్టం జరిగిన మూడు నెలల్లోపే సబ్సిడీ అందించిన సీఎం రైతుల పక్షపాతి అన్నారు. కలెక్టర్‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 

Updated Date - 2022-02-16T05:44:23+05:30 IST