9న ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కౌన్సిల్ సమావేశం
ABN , First Publish Date - 2022-06-07T07:00:39+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రెండో కౌన్సిల్ సమావేశం ఈనెల 9వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులంతా హాజరై విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గ్రామరెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
ఏలూరు రూరల్, జూన్ 6 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రెండో కౌన్సిల్ సమావేశం ఈనెల 9వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులంతా హాజరై విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గ్రామరెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమా వేశానికి పలువురు రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారన్నారు. సమా వేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని తాలూకా కమిటీ సభ్యులు, జిల్లా, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ అధికారులు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.