AP News: ఏలూరులో బాలుడి కిడ్నాప్ సుఖాంతం
ABN , First Publish Date - 2022-12-13T10:43:09+05:30 IST
జిల్లాలోని పదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది.
ఏలూరు: జిల్లాలోని పదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తంగెళ్ళమూడి లక్ష్మినగర్కు చెందిన యశ్వంత్ (10)అనే బాలుడు రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురయ్యాడు. బాలుడిని విడుదల చేయడానికి కిడ్నాపర్లు మూడు లక్షలు డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని కిడ్నాపర్లను రక్షించారు. కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.