భౌబోయ్‌.. భరించలేకపోతున్నాం..

ABN , First Publish Date - 2022-02-19T05:52:20+05:30 IST

ఎక్కడ చూసినా భౌబోయ్‌ అంటు న్నారు..ఏ గ్రామంలో చూసినా వందల సంఖ్యలో కుక్కలు పెరిగిపోయాయి.

భౌబోయ్‌.. భరించలేకపోతున్నాం..
ఆచంటలో రోడ్డుపై గుంపులుగా కుక్కలు

గ్రామాల్లో కుక్కల బెడద


ఆచంట, ఫిబ్రవరి 18 : ఎక్కడ చూసినా భౌబోయ్‌ అంటు న్నారు..ఏ గ్రామంలో చూసినా వందల సంఖ్యలో కుక్కలు పెరిగిపోయాయి. దీంతో చాలా గ్రామాలకు వెళ్లాలంటేనే భయపడే పరి స్థితి.. ఎందుకంటే ఏ కుక్క ఎటు నుంచి వచ్చి మీదపడుతుందోనని జంకుతు న్నారు.గతంలో కుక్కల నిర్మూలన చర్యల కారణంగా కుక్కలు తక్కువగా ఉండేవి.. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా చాలా కాలంగా కుక్కల నిర్మూలన చేపట్టడంలేదు.. దీంతో ప్రతీ గ్రామంలోనూ వందల సంఖ్యలో కుక్కల పెరిగిపోయాయి. ఆచంట మండలంలో ఇటీవల ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో కుక్కలు రోడ్లమీద విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. రాత్రి వేళల్లో అయితే పలు సెంటర్లలో కుక్కల దండు ఒకే చోట ఉండి రోడ్డు మీద వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల పెనుమంచిలిలో ఒక రైతుపై పిచ్చికుక్క దాడిచేసింది.. దీంతో అతను ఆసుపత్రి పాలయ్యాడు. ప్రతి రోజూ ఇటువంటి ఘటనలు సాధారణంగా మారాయి. అధికారులు స్పందించి గ్రామాల్లో కుక్కలు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-02-19T05:52:20+05:30 IST