పీఆర్‌సీ ప్రతుల దహనం

ABN , First Publish Date - 2022-01-28T06:10:23+05:30 IST

ఉద్యోగ, కార్మికులకు తీవ్ర నష్టం తెచ్చే 11వ పీఆర్‌సీ రద్దుచేసి, అశుతోష్‌ కమిటి నివేదికను బహిర్గతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు బొద్దాని నాగరాజు డిమాండ్‌ చేశారు.

పీఆర్‌సీ ప్రతుల దహనం
తణుకులో పీఆర్‌సీ ప్రతులను దహనం చేస్తున్న ఏఐటీయూసీ

వామపక్షాల ఆధ్వర్యంలో పలుచోట్ల ఆందోళనలు ఉధృతం

తణుకు, జనవరి 27: ఉద్యోగ, కార్మికులకు తీవ్ర నష్టం తెచ్చే 11వ పీఆర్‌సీ రద్దుచేసి, అశుతోష్‌ కమిటి నివేదికను బహిర్గతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు బొద్దాని నాగరాజు డిమాండ్‌ చేశారు. గురువారం ఉద్యోగ సంఘాలు పిలుపులో భాగంగా ఎన్టీఆర్‌ చౌక్‌ వద్ద పీఆర్‌సీ ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు పొలు మూరి జ్యోతిబాబు, వెంకటేష్‌, వెంకటేశ్వరావు, తాతయ్య తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వ ర్యంలో వెంకటేశ్వర సెంటరులో ఆందోళన నిర్వహించి జీవో ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో అడ్డ గర్ల అజయకుమారి, నాగేశ్వరావు, రాజశేఖర్‌, ముత్యా లరావు పాల్గొన్నారు.

మునిసిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

తణుకు, జనవరి 27: మునిసిపల్‌ కార్మికులు వచ్చే నెల ఏడో తేదీ తర్వాత సమ్మెకు సమాయత్తం అవుతున్నట్లు గురువారం మునిసిపల్‌ మేనేజర్‌ నాగేశ్వ రరావుకు నోటీసు అందించారు. ఉద్యోగ, కార్మికులను తీవ్ర నిరాశకు గురిచేసిన పీఆర్‌సీ జీవోలు ఉపసం హరించుకోవాలని యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-01-28T06:10:23+05:30 IST