ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉన్నత స్థాయి

ABN , First Publish Date - 2022-05-18T05:48:51+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగామని మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉన్నత స్థాయి
ఉప్పులూరు పాఠశాల శత వార్షిక కార్యక్రమంలో యర్రా నారాయణస్వామి

ఉప్పులూరు ప్రాథమిక పాఠశాల శత వార్షికోత్సవం


ఉండి, మే 17: ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగామని మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి అన్నారు. ఉప్పులూరు ప్రాథమిక పాఠశాల శత వార్షికోత్సవం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. 1922 మే 13న ప్రారంభం కావడంతో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వందేళ్ల వేడుక నిర్వహించారు. గ్రామానికి చెందిన నిమ్మల చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి నారాయణస్వామి అధ్యక్షత వహిం చారు. ప్రతీ పాఠశాలలో విద్యతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల న్నారు. పాఠశాల అభివృద్దికి తాను సహకారం అందిస్తానని తెలిపారు. పాఠశాలకు కంప్యూటర్లు, క్రీడా పరికరాలు సమకూర్చుతామని పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. నిమ్మల సుబ్బారావు, నిమ్మల సత్యనారా యణ, యర్రా హరి, పి.నరసింహారావు, యర్రా శ్రీదేవి, యర్రా లక్ష్మి, నిమ్మల శేషారత్నం, వీధి రామకేశవదాసు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:48:51+05:30 IST