ప్రతి గింజా కొనుగోలు చేస్తాం: ఆర్డీవో
ABN , First Publish Date - 2022-12-09T23:54:57+05:30 IST
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చే స్తుందని బొబ్బిలి ఆర్డీవో శేషశైలజ అన్నారు.
బాడంగి: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చే స్తుందని బొబ్బిలి ఆర్డీవో శేషశైలజ అన్నారు. మండలంలోని రేజేరు, కోటిపల్లి రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె శుక్రవారం పరి శీలించారు. రైతులు ధాన్యం కొను గోలు కేంద్రాల ద్వారా విక్రయించ డానికి నాణ్యతా ప్రమాణాలు తగిన విధంగా సిద్ధం చేయాలన్నారు. రైతులతో ఆమె మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. బ్యాగులు, కళాసీ, రవాణా ఖర్చులు సమకూర్చుకున్న పక్షాన ప్రభుత్వం నిర్దేశించిన నగదును రైతు ఖాతాలకు 21 రోజుల్లో ధాన్యం నగదుతోపాటు జమచేస్తామన్నారు. తహసీల్దార్ బాలమురళీ కృష్ణ, వ్యవసాయాధికారి కే.శిరీష, వీఏఏ సాయికుమార్, వీహెచ్ఏ అనూష, ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.