వైద్యుల కొరత లేదు
ABN , First Publish Date - 2022-12-09T23:59:09+05:30 IST
జిల్లాలో వైద్యుల కొరత లేదని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని ఇన్చార్జి డీఎంహెచ్వో సి.దుర్గాకల్యాణి తెలిపారు.
పాచిపెంట, డిసెంబరు 9 : జిల్లాలో వైద్యుల కొరత లేదని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని ఇన్చార్జి డీఎంహెచ్వో సి.దుర్గాకల్యాణి తెలిపారు. శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. శుక్రవారం పాచిపెంట పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం కింద ప్రతి నెలా 9న గర్భిణులకు పది రకాల పరీక్షలు నిర్వహించి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. స్కానింగ్ అవసరమైతే అందుబాటులోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న గర్భిణులను పీహెచ్సీకి తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ పరిశీలనలో వైద్యులు గంటా వెంకటరమణ, ఎం.రవిచంద్ర, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.