ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఫీజు గడువు పెంపు
ABN , First Publish Date - 2022-11-16T00:11:45+05:30 IST
జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష(ఎన్ఎంఎంఎస్)కు సంబంధించి ఫీజు గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో ఎస్డీవీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్వతీపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష(ఎన్ఎంఎంఎస్)కు సంబంధించి ఫీజు గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో ఎస్డీవీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావాసులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం, వెబ్సైట్, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని కోరారు.