అవకతవకలకు పాల్పడితే సహించం
ABN , First Publish Date - 2022-12-09T23:59:23+05:30 IST
జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ హెచ్చరించారు.
సాలూరు రూరల్, డిసెంబరు 9: జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ హెచ్చరించారు. శుక్రవారం శివరాంపురంలో ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఆర్బీకేల ద్వారా ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్న దానిపై ఆరా తీశారు. మద్దతు ధర కంటే తక్కువగా ఎవరు కొనరాదని, తక్కువ విక్రయాలు జరగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణా చార్జిలను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వ్యవసాయ, గ్రామ సచివాలయాలు సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి ధాన్యం విక్రయాలు సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ఈ పరిశీలనలో ఏవో అనురాధ పండా , సర్పంచ్ జరజాపు మోహనరావు, వీఏఏ వెంకటేష్ తదితరులున్నారు.