బీసీ సాధికారిత కమిటీలో మనోళ్లు

ABN , First Publish Date - 2022-11-29T00:16:08+05:30 IST

టీడీపీ బీసీ సాధికారిత కమిటీలో జిల్లా నేతలకు చోటు దక్కింది.

బీసీ సాధికారిత కమిటీలో మనోళ్లు

పార్వతీపురం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ బీసీ సాధికారిత కమిటీలో జిల్లా నేతలకు చోటు దక్కింది. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలకు చెందిన నాయకుల్లో పలువురు పార్లమెంటు, నియోజకవర్గ స్థాయిలోని కమిటీల్లో స్థానం సంపాదించారు. ఈ మేరకు సోమవారం పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన గొట్టాపు వెంకటనాయుడు, పి.సాంబమూర్తి, కె.సత్యారావు, సాలూరుకి చెందిన పిన్నింటి ఈశ్వరరావు, పాలకొండకి చెందిన జామి లక్ష్మీనారాయణను బీసీ సాధికార సమితి సభ్యులుగా నియమించారు. కురుపాం నియోజకవర్గానికి సంబంధించి మండల సత్యంనాయుడు, వీరఘట్టానికి చెందిన జామి సింహాచలాన్ని కన్వీనర్లుగా నియమించారు.

Updated Date - 2022-11-29T00:16:09+05:30 IST