AP News: వారికి చంద్రబాబుతోనే న్యాయం జరుగుతుంది: డా.కేఏ నాయుడు

ABN , First Publish Date - 2022-12-06T13:22:12+05:30 IST

వైసీపీ పాలన (YCP Govt.)లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, చంద్రబాబు (Chandrababu)తోనే.. వారికి న్యాయం జరుగుతుందని పేర్కొంటూ..

AP News: వారికి చంద్రబాబుతోనే న్యాయం జరుగుతుంది: డా.కేఏ నాయుడు

విజయనగరం: వైసీపీ పాలన (YCP Govt.)లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, చంద్రబాబు (Chandrababu)తోనే.. వారికి న్యాయం జరుగుతుందని పేర్కొంటూ.. మంగళవారం గజపతినగరం నియోజకవర్గం టీడీపీ (TDP) కార్యాలయం నుంచి ఎమ్మార్వో (MRO) కార్యాలయం వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటి తహసీల్దార్‌కు వినతి పత్రం అందచేశారు.

ఈ సందర్భంగా గజపతినగరం, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు (Dr. KA Naidu) మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి (CM Jagan) బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, బీసీల్లో ఏ ఒక్క కుటుంబానికి రాయితీతో కూడిన ప్రయోజనాలు అందించలేదని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ.34 వేల కోట్ల నిధులు దారి మళ్లించి వైసీపీ తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, గతంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు అందించిన పథకాలన్నింటినీ జగన్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T13:22:15+05:30 IST