మద్యం తరలించిన వ్యక్తికి జైలు
ABN , First Publish Date - 2022-11-24T00:07:16+05:30 IST
అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుడిన కొల్లిపేటకు చెందిన కొల్లి సూరిబాబుకు న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్టు భోగాపురం ఎస్ఈబీ సీఐ ఎంఆర్వీ అప్పారావు బుధవారం తెలిపారు.
భోగాపురం: అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుడిన కొల్లిపేటకు చెందిన కొల్లి సూరిబాబుకు న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్టు భోగాపురం ఎస్ఈబీ సీఐ ఎంఆర్వీ అప్పారావు బుధవారం తెలిపారు. సూరిబాబు గత ఏడాది ఫిబ్రవరి 6న 82 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తూ పట్టుబడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. నేరం రుజువు కావడంతో ఆరు నెలలు జైలుతోపాటు రూ.2లక్షలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు తెలిపారు.