కదలని ఏనుగులు
ABN , First Publish Date - 2022-06-07T05:30:00+05:30 IST
మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తు న్నాయి. గత నాలుగు రోజుల నుంచి గిజబ, నందివానివలస, తోటపల్లి, సంతో షపురం, తదితర గ్రామాల్లోనే సంచరి స్తున్నాయి. అరటి, చెరకు తదతర పంటలను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తిపై దాడి చేశాయి.
ఒకరిపై దాడి
తప్పిన ప్రాణహాని
పంటలు ధ్వంసం
గరుగుబిల్లి, జూన్ 7 : మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తు న్నాయి. గత నాలుగు రోజుల నుంచి గిజబ, నందివానివలస, తోటపల్లి, సంతో షపురం, తదితర గ్రామాల్లోనే సంచరి స్తున్నాయి. అరటి, చెరకు తదతర పంటలను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తిపై దాడి చేశాయి. సంతోషపురం పంచాయతీ ఖడ్గవలసకు చెందిన బంకురు అప్పలనాయుడు తన పొలానికి వెళ్లిన సమయంలో ఓ ఏనుగు దాడి చేసింది. దీంతో ఆయన కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణహాని తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆయా ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపు తరలింపునకు తగు చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.