రేపు ఏపీ ఎన్జీవో సంఘం ఎన్నికలు

ABN , First Publish Date - 2022-11-29T00:14:52+05:30 IST

జిల్లాకేంద్రంలోని ఏపీ ఎన్జీవో సంఘం భవనంలో ఈ నెల 30న ఎన్జీవో పార్వతీపురం యూనిట్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం ఎన్నికల అధికారి కె.ఆదిలక్ష్మి సోమవారం తెలిపారు.

రేపు ఏపీ ఎన్జీవో సంఘం ఎన్నికలు

పార్వతీపురం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని ఏపీ ఎన్జీవో సంఘం భవనంలో ఈ నెల 30న ఎన్జీవో పార్వతీపురం యూనిట్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం ఎన్నికల అధికారి కె.ఆదిలక్ష్మి సోమవారం తెలిపారు. స్థానిక విలేఖర్లతో ఆమె మాట్లాడుతూ... ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం పట్టణానికి చెందిన ఎన్జీవోలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2022-11-29T00:14:54+05:30 IST