రైతులను అసౌకర్యానికి గురిచేయొద్దు
ABN , First Publish Date - 2022-12-09T23:58:51+05:30 IST
రైతులను మిల్లర్లు అసౌకర్యానికి గురిచేయరాదని జాయింట్ కలెక్టర్ ఆనంద్ తెలిపారు.
గరుగుబిల్లి, డిసెంబరు 9 : రైతులను మిల్లర్లు అసౌకర్యానికి గురిచేయరాదని జాయింట్ కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సుంకి ప్రాంతంలోని పౌర సరఫరాల గొడౌన్లో మిల్లింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల మేరకు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేసి సకాలంలో ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయానికే సంబంధిత గౌడౌన్లకు నాణ్యమైన బియ్యాన్ని అప్పగించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం.దేవళ్లనాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి మూర్తి, అసోసియేషన్ ప్రతినిధులు కె.రమేష్, జి.ఉదయభాను, ఎ.మధుసూదనరావు, రవికుమార్. జి.లక్ష్ముంనాయుడు తదతరులు పాల్గొన్నారు.