‘బాధితులకు సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి’
ABN , First Publish Date - 2022-11-07T23:35:53+05:30 IST
అగ్రిగోల్డ్ బాధితుల కు న్యాయం చేస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
బొబ్బిలి: అగ్రిగోల్డ్ బాధితుల కు న్యాయం చేస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం స్థానిక తహసీల్దార్ ఎన్.రాజారావుకు సీపీఐ పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ అధ్యక్షుడు పోల ఈశ్వరనారాయణ, వి.యశోధ, జ్యోతి ప్రకాశ్, రాంబాబు, గౌరీశంకర్ పాల్గొన్నారు.
Read more