ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి

ABN , First Publish Date - 2022-12-09T23:57:09+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని బ హుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి పిలు పునిచ్చారు.

 ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి

విజయనగరం దాసన్నపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని బ హుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి పిలు పునిచ్చారు. శుక్రవారం కంటోన్మెంట్‌లోని పార్టీ కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు కొమ్ము సోములు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన పరంజ్యోతి మాట్లాడుతూ... జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా పాడేరులో బహుజన రాజ్యా ధికార యాత్ర ప్రారంభిస్తామన్నారు. ఈ యాత్ర శ్రీకాకుళం మీదుగా విజయ నగ రం చేరుతుందని చెప్పారు. ఈ నెల 28న విజయనగరంలో సభను నిర్వహించి అన్నమయ్య జిల్లాలో చివరి బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సమాజంలో బ హుజనులకు కల్పించిన హక్కులకు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. దీనిపై ఐక్యంగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. బీఎస్పీ ప్రతినిధులు సోము రాంబాబు, శివప్రసాద్‌, శ్రీనివాస్‌, పైడిరాజు, గురునాథ్‌రావు, రామప్పడు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:57:11+05:30 IST