అవినీతి పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-11-25T00:11:38+05:30 IST

అవినీతి పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర బీసీ కార్యవర్గ కార్యదర్శి వెన్నె సన్యాసినాయుడు అన్నారు.

అవినీతి పాలనకు చరమగీతం పాడాలి
ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

గుర్ల: అవినీతి పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర బీసీ కార్యవర్గ కార్యదర్శి వెన్నె సన్యాసినాయుడు అన్నారు. కలవచర్ల గ్రామంలో గురువారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ మహేశ్వరరావు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు కిలారి సూర్యనారాయణ, శివప్రసాద్‌, నాగులపల్లి నారాయణరావు, పి.శ్రీనివాసరావు, మండల అప్పలనాయుడు, నీలరోతు నారాయణరావు, అప్పలనాయుడు, కలవచర్ల గ్రామ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:11:42+05:30 IST