వృద్ధుడి అదృశ్యంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-12-06T23:56:28+05:30 IST

మండలంలోని పూతికవలసపంచాయతీ పరిధిలో గల సిరికొండ ఒబ్బంగి గ్రామానికి చెందిన వృద్ధుడు కొండగొర్రె తట్టయ్య అదృశ్యమయ్యాడు.

 వృద్ధుడి అదృశ్యంపై కేసు నమోదు

సీతంపేట: మండలంలోని పూతికవలసపంచాయతీ పరిధిలో గల సిరికొండ ఒబ్బంగి గ్రామానికి చెందిన వృద్ధుడు కొండగొర్రె తట్టయ్య అదృశ్యమయ్యాడు. ఈ మేరకు గ్రామస్థులు, బంధువులు కొండగొర్రె సుదర్శన్‌, కె.నాగేశ్వరరావు, కూరంగి రమేష్‌, తేజేశ్వర్‌, విజయ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళ వారం కేసు నమోదు చేసినట్లు సీతంపేట ఏఎస్‌ఐ జీవీ రమణ తెలిపారు. ఈనెల రెండో తేదీన బీపీ, సుగర్‌ అధికంగా ఉందని సీతంపేట ఏరియా ఆసుప త్రిలో చేరాడని చెప్పారు. ఈ మేరకు అక్కడ చికిత్సపొందుతున్న అదేరోజు రాత్రి ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2022-12-06T23:56:29+05:30 IST