వివేకా హత్య కేసులో మరోసారి వాంగ్మూలం
ABN , First Publish Date - 2022-02-17T04:10:51+05:30 IST
వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరితో సీబీఐ అధికారులు మరోసారి 164 వాంగ్మూలం ఇప్పిస్తున్నారు. పులివెందుల కోర్టు మేజిస్ట్రేట్ను..
కడప: వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరితో సీబీఐ అధికారులు మరోసారి 164 వాంగ్మూలం ఇప్పిస్తున్నారు. పులివెందుల కోర్టు మేజిస్ట్రేట్ను సీబీఐ అధికారులు కలిశారు. ఏపీ హైకోర్టులో దస్తగిరి అప్రూవర్ పిటిషన్ రద్దు కావడంతో పులివెందుల మేజిస్ట్రేట్ను సీబీఐ అధికారులు కలిశారు. దస్తగిరి దగ్గర మరోమారు వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతి కోసం పులివెందుల మేజిస్ట్రేట్ను సీబీఐ కలిసింది.