Vishnukumar Raju: అమరావతి రైతుల పాదయాత్రపై విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-27T16:46:51+05:30 IST

ఉత్తరాంధ్రలో రాజధాని రైతులు పాదయాత్ర చేస్తే.. చూస్తూ ఊరుకోమని అంటున్న వైసీపీ నేతలపై...

Vishnukumar Raju: అమరావతి రైతుల పాదయాత్రపై విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు

విశాఖ (Visakha): ఉత్తరాంధ్రలో రాజధాని రైతులు (Farmers) పాదయాత్ర (Padayatra) చేస్తే.. చూస్తూ ఊరుకోమని అంటున్న వైసీపీ (YCP) నేతలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు (Vishnukumar Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మాఊరు వస్తే ఊరుకోమంటే.. ఇదేమైనా వారి సొంత జాగీరా?’ అని ప్రశ్నించారు. అసరవెల్లి సూర్యనారాయణ స్వామిని ఎవరైనా ఎప్పుడైనా దర్శించుకోవచ్చునని, బుర్రలేనివాళ్లే వద్దని అంటారని అన్నారు. 


ఈ సందర్బంగా విష్ణుకుమార్ రాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో దారుణాతి దారుణంగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే అది అమరావతి రైతులేనని అన్నారు. ఉత్తరాంధ్రలో రాజధాని రైతులు పాదయాత్ర చేస్తే.. ఊరుకోమని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారని, చూస్తూ ఊరుకోక పోతే.. ఇంట్లోనే కూర్చోవాలని సూచించారు. అమరావతి రైతులను బెదిరించడం సరికాదన్నారు. రైతుల పాదయాత్రకు బీజేపీ (BJP) అండదండలు ఉంటాయని స్పష్టం చేశారు. జగన్ సర్కారు (Jagan Govt.) మూడున్నర ఏళ్ల నుంచి  అమరావతి రైతులను మానసిక క్షోభకు గురిచేస్తోందని, అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకుంటుందని కూడా విష్ణుకుమార్‌రాజు హెచ్చరించారు.

Updated Date - 2022-09-27T16:46:51+05:30 IST